కష్టే ఫలి...
అనగనగ...
ఒక ఊరిలో రాము,సోము అనే ఇద్దరు అడుక్కునే వాళ్ళు ఉన్నారు.వాళ్ళల్లో
రాము కుంటివాడు,సోము గ్రుడ్డివాడు, వాళ్ళిద్దరికి మంచి స్నేహం కుదిరింది. ఒక రోజున
రాము సోము ఇద్దరూ పక్క ఊరి జాతరకు వెళ్ళి ఎలాగైనా ధర్మం రూపంలో డబ్బు సంపాదించాలి
అని అనుకుంటున్నారు.
ఐతే వాళ్ళల్లో ఒకరు చూడలేరు, ఒకరు నడవలేరు. జాతరకు ఇంకా పది
రోజులు మాత్రమే ఉంది. ఎలా వెళ్ళాలా అని ఆలోచించగా వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది.
వాళ్ళిద్దరూ వెళ్ళటానికి ఏదైనా ఒక బండి తయారు చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నారు.
వెనువెంటనే దానిని అమలు పరిచారు. ఒకసారి దానిమీద అలా పక్క సందు దాక వెళ్ళి వద్దాం
అని అనుకునే లొపే వర్షం వచ్చింది,అప్పుడు వాళ్ళు ఎండకి ఎండకుండా,వానకి తడవకుండా
ఉండే బండి తయారు చేయాలని నిర్ణయించుకొని, దానిని తయారు చేసారు.
ఆ బండి మీద ఒకసారి
పక్క సందు దాక వెళ్ళి వద్దాం అని అనుకొని బయలు దేరారు, అలా వెళ్తుండగా, ఒక
వాహనాలమ్మే వ్యాపారి చూసి, దీనిని మీరెక్కడ కొన్నారు అని అడిగాడు. ఈ బండి మేమే
తయారు చేసాం అని రాము,సోము చెప్పారు.
అప్పుడు ఆ వ్యాపారి, ఎంత ఖర్చైనా సరే ఇలాంటి
బళ్ళు ఒక పది కావాలి, మీరు తయారు చేసి ఇవ్వగలరా? చెప్పండి, అని అడిగాడు. అప్పుడు
రాము,సోము ఇద్దరూ, అడుక్కుంటే వచ్చే డబ్బు కంటే, ఈ విధంగా మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో సంతోషంగా బ్రతకొచ్చు కదా! అనుకుని, ఇంక, వాళ్ళిద్దరు అడుక్కునే వృత్తి
మానేసి, కొత్త కొత్త వాహనాలు తయారుచేస్తూ, మంచి పేరు ప్రఖ్యాతులు
సంపాదించుకున్నారు.
No comments:
Post a Comment